1 "దేవుని యెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు యెదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా-"
2 "వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము బుద్ధిచెప్పుము."
3 "ఎందుకనగా, జనులు ఆరోగ్యకరమైన హితబోధను సహింపక దురద చెవులు గలవారై, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసుకొని,"
4 సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథల వైపునకు తిరుగు కాలము వచ్చును.
5 "అయితే నీవు అన్ని విషయములలో మితముగానుండుము., శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము."
6 "నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది."
7 "మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని."
8 "ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును."
9 నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము.
10 "దేమా యిహ లోకములోను స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్ళెను, క్రేస్కే గలతీయకును, తీతు దల్మతియకును వెళ్ళిరి."
11 లూకా మాత్రమే నాయొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసుకు పంపితిని.
12 "నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పు నొద్ద యుంచి వచ్చిన అంగీని, పుస్తకములను,"
13 ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము.
14 "అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాలాకీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును."
15 "అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను."
16 "నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరు నన్ను విడిచి పోయిరి; ఇది వారికి నేరముగా ఎంచబడ కుండును గాక."
17 "అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దానిని విను నిమిత్తమును, ప్రభువు నాపక్షమున నిలిచియుండి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని."
18 "ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్."
19 ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటి వారికిని నా వందనములు.
20 . ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతనిని మిలేతులో విడిచి వచ్చితిని.
21 ". శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు."
22 "ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక, కృప మీకు తోడై యుండును గాక." |