1 "వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులును, దేవాలయపు అధిపతియు, సద్యూకయ్యులును"
2 "వారు ప్రజలకు బోధించుటయు యేసుని బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి,"
3 వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో నుంచిరి.
4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదువేలు ఆయెను.
5 "మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి. ప్రధానయాజకుడైన అన్నయు, కయపయు, యోహానును అలెక్సంద్రును,"
6 ప్రధాన యాజకుని బంధువులందరును వారితో కూడ ఉండిరి.
7 "వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలముచేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా,"
8 "పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను- ప్రజల అధికారులారా, పెద్దలారా,"
9 "ఆ దుర్భలునికి చేయబడిన ఉపకారమును గూర్చి, వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక"
10 "మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా - మీరు సిలువ వేసినట్టియు, మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ యెదుట నిలిచియున్నాడు."
11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
12 "మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను."
13 "వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడ ఉండినవారని గుర్తెరిగిరి."
14 స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి ఏవియు ఎదురు చెప్పలేకపోయిరి.
15 "అప్పుడు సభ వెలుపలికి పొండని వారికాజ్ఞాపించి తమలో తాము ఆలోచించి,"
16 ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టము. అది జరుగలేదని చెప్పజాలము.
17 "అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇక మీద ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను, మాటలాడకూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి."
18 "అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికాజ్ఞాపించిరి."
19 అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి.
20 "మేము కన్నవాటిని, విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి."
21 ప్రజలందరు జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభ వారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి.
22 స్వస్థపరచుట అను ఆ సూచకక్రియ ఎవని విషయములో చేయబడెనో వాడు నలువది యేండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు.
23 వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలును తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి.
24 "వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి - నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు."
25 అన్యజనులు ఏల అల్లరి చేసిరి?
26 ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను అనగా అభిషిక్తుని మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
27 "ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును,"
28 పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
29 "ప్రభువా, ఈ సమయము నందు వారి బెదిరింపులు చూచి"
30 "రోగులను స్వస్థపరచుటకు, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామముద్వారా సూచకక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాపియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు, అనుగ్రహించుము."
31 వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
32 విశ్వసించిన వారందరు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి.. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగిన దంతయు వారికి సమిష్టిగా ఉండెను.
33 ఇదియు గాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా నుండెను.
34 "భూములైనను, ఇండ్లయినను కలిగిన వారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచుండిరి."
35 వారు ప్రతి వానికి వానివాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను.
36 కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకుండెను. అతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు అనగా ఆదరణ పుత్రుడు అను అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి.
37 "ఇతడు భూమిగలవాడైయుండి దానిని అమ్మి, దాని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను." |