1 "పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి యుండెను. ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ విషయమును యేసుతో చెప్పగా,"
2 ఆయన వారితో ఈ విధముగా చెప్పెను- ''ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరి కంటె పాపులని మీరు తలంచుచున్నారా?
3 కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందని యెడల మీరందరు ఆలాగే నశింతురు.
4 మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిది మంది యెరూషలేములో కాపురమున్న వారందరి కంటె అపరాధులని తలంచుచున్నారా?
5 కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనస్సు పొందని యెడల మీరందరును ఆలాగే నశింతురు''.
6 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను- ''ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియు దొరకలేదు.
7 "గనుక అతడు తనలో తాను మూడేండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమియు దొరకలేదు, దీనిని నరికి వేయుము దీని వలన ఈ భూమి కూడ ఎందుకు వ్యర్థము కావలెనని ఆ ద్రాక్షతోట మాలితో చెప్పగా, ఆ మాలి-"
8 "'అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరుపు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడ వుండనిమ్ము."
9 అది ఫలించిన సరే. లేని యెడల నరికివేయుమని అతనితో చెప్పెను''
10 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు
11 పదునెనిమిది యేండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి చక్కగా నిలువబడలేకుండెను.
12 "యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి ''అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావు'' అని ఆమెతో చెప్పి,"
13 ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
14 "యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి - పని చేయదగిన ఆరు దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత నొందుడి; విశ్రాంతి దినమున రావద్దని చెప్పెను."
15 "అందుకు ప్రభువు- ''వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్ళుపెట్టును గదా!"
16 ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన ఈమెను విశ్రాంతిదినమందు ఈ బంధకమునుండి విడిపింప తగదా?'' అని అతనితో చెప్పెను.
17 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.
18 ఆయన ''దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దానిని పోల్తును?
19 ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించెను'' అని చెప్పెను.
20 మరల ఆయన ''దేవుని రాజ్యమును దేనితో పోల్తును ?
21 ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది'' అని చెప్పెను.
22 ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను.
23 "ఒకడు- ''ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా ?'' అని ఆయన నడుగగా,"
24 ఆయన వారిని చూచి - ''ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను
25 "ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా - మాకు తలుపు తీయమని చెప్ప నారంభించి నప్పుడు,"
26 ఆయన - మీరెక్కడివారో మిమ్ము నెరుగనని ఉత్తర మిచ్చును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగు చుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు
27 అప్పుడాయన మీరెక్కడివారో మిమ్ము నెరుగనని మీతో చెప్పుచున్నాను; అక్రమము చేయు మీరందరు నాయొద్ద నుండి తొలగి పొండని చెప్పును.
28 "అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో నుండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచున్నప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు."
29 మరియు జనులు తూర్పు నుండియు పడమట నుండియు ఉత్తరము నుండియు దక్షిణము నుండియు వచ్చి దేవునిరాజ్య మందు కూర్చుందురు.
30 "ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారు కొందరు కడపటి వారగుదురు'' అని చెప్పెను."
31 "ఆ ఘడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి - నీవిక్కడ నుండి బయలు దేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా,"
32 "ఆయన వారితో - ''మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి. నేడును, రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెను."
33 అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండ వలెను; ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు.
34 "యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెననియుంటిని గాని మీరొల్లక పోతిరి"
35 ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడు చున్నది - ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడు గాక యని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను'' అనెను. |