1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను.
2 ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య.
3 అందరును ఆ సంఖ్యలో వ్రాయబడ వలెనని తమ తమ పట్టణములకు వెళ్ళిరి.
4 యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక
5 "తనకు భార్యగా ప్రధానము చేయబడి, గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలోవ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను."
6 వారక్కడ నున్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక
7 "తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున, ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను."
8 ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా
9 ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
Angel Appears to Shepherds 10 అయితే ఆ దూత ''భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోష కరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
11 "దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు."
12 దానికిదే మీ కానవాలు - ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.
13 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి-
14 ''సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక'' యని దేవునికి స్తోత్రము చేయుచుండెను.
15 "ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులు, - జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు; మనము బేత్లెహేము వరకు పోయి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని,"
16 "త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టెలో పండుకొని యున్న శిశువును చూచిరి."
Jesus in the Manger 17 "వారు చూచి, యీ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి."
18 గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.
Shepherds Tell Their Story 19 అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసికొనెను.
20 "అంతట ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి."
21 "ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు, దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి."
22 మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గచినప్పుడు
23 ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రము నందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్టించుటకును
24 ప్రభువు ధర్మశాస్త్రమునందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొనిపోయిరి.
25 "యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను, అతడు నీతి మంతుడును భక్తి పరుడునై యుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద నుండెను."
26 అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి యుండెను; ఆత్మ వశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను.
27 అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు
28 "తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయము లోనికి తీసుకొని వచ్చినప్పుడు, అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను-"
Simeon and Baby Jesus 29 "''నాథా, యిప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు."
30 నీవు సకల ప్రజల యెదుట సిద్ధపరచిన
31 "నీ రక్షణను, అన్యజనులకు నిన్ను బయలు పరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను"
32 నేను కన్నులారా చూచితిని''
33 యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.
34 సుమెయోను వారిని దీవించి - ''ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి యున్నాడు.
35 మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొని పోవును'' అని ఆయన తల్లియైన మరియతో చెప్పెను
36 "మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి, బహుకాలము గడచినదై"
37 ఎనుబది నాలుగు సంవత్సరములు విధవరాలై యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను.
38 "ఆమె కూడ ఆ ఘడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను."
39 అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి.
40 "బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయన మీద నుండెను."
41 పస్కా పండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండెడి వారు.
42 ఆయన పన్నెండేళ్ళవాడైయున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి.
43 ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను.
44 "ఆయన తలిదండ్రులు ఆ సంగతి తెలియక ఆయన సమూహములో నున్నాడని తలంచి, ఒక దిన ప్రయాణములో సాగిపోయి, తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదకుచుండిరి."
45 ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.
46 మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచుండగా చూచిరి.
The Boy Jesus in the Temple 47 ఆయన మాటలు విన్నవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.
48 "ఆయన తలిదండ్రులాయనను చూచి మిక్కిలి ఆశ్చర్య పడిరి. ఆయన తల్లి - ''కుమారుడా, మమ్మును ఎందుకు ఈలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమి'' అని ఆయనతో చెప్పగా,"
49 ఆయన- ''మీరేల నన్ను వెదకుచుంటిరి ? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా'' యని వారితో చెప్పెను.
50 అయితే తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.
51 అంతట ఆయన వారితో కూడ బయలు దేరి నజరేతునకు వచ్చి వారికి లోబడియుండెను. ఆయన తల్లి ఈ సంగతు లన్నిటిని తన హృదయములో భద్రము చేసుకొనెను.
52 "యేసు జ్ఞానము నందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్థిల్లు చుండెను." |