Bible, మార్కు సువార్త, అధ్యాయం 10. is available here: https://www.bible.promo/chapters.php?id=10967&pid=43&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / మార్కు సువార్త

Bible - Telugu Bible OV, 1880

మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 "ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను, జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడివచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించు చుండెను."

2 పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై - పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా ? అని ఆయన నడిగిరి.

3 అందుకాయన- ''మోషే మీకేమి ఆజ్ఞాపించెను'' అని వారి నడిగెను.

4 "వారు - పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు-"

5 "''మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు యాజ్ఞను మీకు వ్రాసి యిచ్చెను గాని,"

6 సృష్ట్యాది నుండి (దేవుడు) వారిని పురుషుని గాను స్త్రీనిగాను కలుగజేసెను.

7 ఈ హేతువు చేత పురుషుడు తన తలిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును.

8 "వారిద్దరు ఏక శరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు."

9 కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదు'' అని వారితో చెప్పెను.

10 ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతి గూర్చి ఆయనను మరలా అడిగిరి.

11 "అందుకాయన - ''తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసుకొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించు వాడగును, మరియు"

12 స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లి చేసికొనిన యెడల ఆమె వ్యభిచరించునదగును'' అని వారితో చెప్పెను.

13 తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరాయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు (వారిని తీసుకొని వచ్చిన) వారిని గద్దించిరి.

14 "యేసు అది చూచి కోపపడి- ''చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంక పరచవద్దు. దేవుని రాజ్యము ఇలాటి వారిదే."

15 "చిన్న బిడ్డలవలె దేవుని రాజ్యమునంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని చెప్పి,"

16 ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.

మార్కు సువార్త 10:16 - Jesus Blesses the Children
Jesus Blesses the Children
17 "ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన యెదుట మోకాళ్ళుని - సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయననడిగెను."

18 యేసు - ''నన్ను సత్పురషుడని ఏల చెప్పుచున్నావు ? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు.

19 "నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా'' అని అతనితో చెప్పెను."

20 "ఆందుకతడు- బోధకుడా, బాల్యము నుండి ఇవియన్నియు ననుసరించుచునే యుంటినని చెప్పెను."

21 "యేసు అతనిని చూచి అతని ప్రేమించి- ''నీకు ఒకటి కొదువగా నున్నది, నీవు వెళ్ళి నీకు కలిగియున్న దంతయు అమ్మి బీదల కిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుము'' అని చెప్పెను."

22 "అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్ళిపోయెను."

23 అప్పుడు యేసు చుట్టూ చూచి - ''ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము'' అని తన శిష్యులతో చెప్పెను.

24 "ఆయన మాటలకు శిష్యులు విస్మయ మొందిరి, అందువలన యేసు తిరిగి వారితో ఇట్లనెను- ''పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము."

25 ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము''

26 అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి - అట్లయితే ఎవడు రక్షణ పొందగలడనిఆయన నడిగిరి.

27 యేసు వారిని చూచి ''ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము గాదు; దేవునికి సమస్తమును సాధ్యమే''అనెను.

28 పేతురు ఇదిగో - మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.

29 అందుకు యేసు ఇట్లనెను - ''నా నిమిత్తమును సువార్తనిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడచిన వాడు.

30 "ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

31 "మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు'' అనెను."

32 "వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడచుచుండగా వారు విస్మయమొందిరి. వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పన్నెండుమంది శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్ప నారంభించి,"

33 ''ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు.

34 "వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచును'' అని చెప్పెను."

35 "జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి - బోధకుడా, మేము అడుగున దెల్ల నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా,"

36 ఆయన - ''నేను మీకేమి చేయగోరుచున్నారు'' అని వారి నడిగెను.

37 వారు - నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి.

38 "యేసు ''మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేతనగునా ?'' అని వారి నడుగగా, వారు - మా చేతనగుననిరి."

39 "అప్పుడు యేసు - ''నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని,"

40 నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరకును'' అని వారితో చెప్పెను.

41 తక్కిన పదిమంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోప పడసాగిరి.

42 యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను - ''అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియును.

43 "మీలో ఆలాగుండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై యుండ గోరినయెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను."

44 మీలో ఎవడైనను ప్రముఖుడై యుండ గోరినయెడల వాడు అందరికిని దాసుడై యుండవలెను.

45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను'' అనెను.

46 వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా; తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను.

47 "ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని- దావీదు కుమారుడా, యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను."

48 "ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని, వాడు- దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను."

49 "అప్పుడు యేసు నిలిచి- ''వానిని పిలువుడి'' అని చెప్పగా, వారా గ్రుడ్డివానిని పిలిచి - ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి."

50 అంతట వాడు బట్టను పారవేసి దిగ్గునలేచి యేసు నొద్దకు వచ్చెను.

51 "యేసు ''నేను నీకేమి చేయ గోరుచున్నావు'' అని వాని నడుగగా, ఆ గ్రుడ్డివాడు - బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను."

52 "అందుకు యేసు - నీవు వెళ్లుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను."

<< ← Prev Top Next → >>