Bible, మార్కు సువార్త, అధ్యాయం 8. is available here: https://www.bible.promo/chapters.php?id=10965&pid=43&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / మార్కు సువార్త

Bible - Telugu Bible OV, 1880

మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

1 "ఆ దినములలో మరియొకసారి బహుజనులు కూడి రాగా వారికి తినుటకు ఏమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి,"

2 ''జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ద నున్నారు. వారికి తిననేమియు లేనందువలన నేను వారి మీద కనికర పడుచున్నాను.

3 నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్చపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారు'' అని వారితో చెప్పెను.

4 అందుకాయన శిష్యులు - ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తి పరచగలడని ఆయననడిగిరి.

5 "ఆయన- మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా, వారు- ఏడనిరి."

6 "అప్పుడాయన - ''నేలమీద కూర్చుండుడి'' అని జనుల కాజ్ఞాపించి, ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి."

7 కొన్ని చిన్న చేపలు కూడ వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడ వడ్డించుడని చెప్పెను.

8 వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.

9 భోజనము చేసినవారు యించుమించు నాలుగు వేలమంది. వారిని పంపివేసిన వెంటనే

10 ఆయన తన శిష్యులతో కూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతమునకు వచ్చెను.

11 అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి.

12 "ఆయన ఆత్మ యందు పెద్ద నిట్టూర్పు విడిచి ''ఈ తరము వారు ఎందుకు ఏ సూచకక్రియ నడుగుచున్నారు ? ఈ తరమునకు సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని'' చెప్పి,"

13 వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను.

14 వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరచిరి; దోనెలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను

15 "ఆయన- చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా,"

16 వారు తమయొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.

17 యేసు అది యెరిగి - ''మన యొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించు కొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా ? వివేచింపలేదా ? మీరు కఠిన హృదయము గలవారైయున్నారా?

18 మీరు కన్నులుండియు చూడరా ? చెవులుండియు వినరా ? జ్ఞాపకము చేసుకొనరా?

19 నేను ఆ అయిదు వేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచె పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండఎత్తితిరి ?'' అని వారి నడిగెను. వారు- పన్నెండని ఆయనతో చెప్పిరి.

20 ''ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచి పెట్టినపుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరి ?'' అని ఆయన అడుగగా వారు- ఏడనిరి.

21 అందుకాయన ''మీరింకను గ్రహింపకున్నారా ?'' అని అడిగెను.

22 "అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి, అప్పుడక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొని వచ్చి, వానిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి."

23 "ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకుని పోయి, వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులంచి - ''నీకేమైనను కనబడుచున్నాదా ?'' అని వాని నడగుగా,"

24 వాడు- కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను

25 "అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా, వాడు, తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను."

26 అప్పుడు యేసు ''నీవు ఊరిలోనికి వెళ్ళవద్దు'' అని చెప్పి వానిని వాని యింటికి పంపివేసెను.

27 యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలు దేరెను. మార్గములో నుండగా ''నేను ఎవడనని జనులు చెప్పుచున్నారు?'' అని తన శిష్యుల నడిగెను.

28 "అందుకు వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు మరి కొందరు ప్రవక్తలలో ఒక నియు చెప్పుకొనుచున్నారనిరి."

29 "అందుకాయన- ''మీరైతే నేనెవడనని చెప్పుచున్నారు'' అని వారి నడుగగా, పేతురు - నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను."

30 అప్పుడు ''తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోను చెప్పవద్దు'' అని ఆయన వారికి ఖండితముగా చెప్పెను.

31 ''మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యము'' అని ఆయన వారికి బోధింప నారంభించెను.

32 ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింప సాగెను.

33 "అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి, వారిని చూచి - ''సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావు'' అని పేతురును గద్దించెను. తన్ను తాను ఉపేక్షించుకొనవలెనని యేసు హెచ్చరించుట"

34 అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి ''నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను.

35 తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టు కొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును.

36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వాని కేమీ ప్రయోజనము ?

37 మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?

38 వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడ వచ్చునప్పుడు సిగ్గుపడును'' అని చెప్పెను.

<< ← Prev Top Next → >>